- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలో గత డిసెంబర్ నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన పంచాయతీ వార్డు సభ్యులకు మొదటి విడత ఈ నెల 17 నుంచి 21 వరకు 5 రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ లక్ష్మారెడ్డి సోమవారం ఓప్రకటన విడుదల చేశారు. రెండవ విడత 24 నుంచి 27 వరకు జరుగుతాయని తెలిపారు. ఇందులో వారి పాలన వ్యవహారాలు, వారియొక్క బాధ్యతలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు తెలిపారు.
- Advertisement -



