- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మర్రిగూడ మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం మర్రిగూడ మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ మరియు కర్నాటి రామయ్య రాజమణి ఆధ్వర్యంలో శాశ్వత అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గత 11 సంవత్సరాలుగా మాజీ సర్పంచ్ మాస నీలిమ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శాశ్వత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య,కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు పొనుగోటి శేఖర్,ఎండి గౌస్,పంపు వెంకటయ్య,డి సైదులు,పొనుగోటి భాస్కరరావు,చిలివేరు మహేష్,సిలివేరు శ్రీను,ఎడ్ల ముత్య,నీల శంకర్,ఎల్వి శర్మ,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



