- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి చెందాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సమత భర్త, కాంగ్రెస్ నాయకుడు రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎదుట పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. కాగా ఎమ్మెల్యే పీఏ మురళీధర్ రెడ్డి తనపై అక్రమ కేసులు పెట్టి వేధించినట్లు రాజేందర్ రెడ్డి ఆరోపించాడు.
- Advertisement -



