Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మస్రుంద్-హమల్ రహదారిపై ఒక వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మృతులలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ముండన్ వేడుకలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బొలెరో వాహనం కుథేడ్ గ్రామ పంచాయతీలోని మహల్ గ్రామానికి చెందినది. పోలీసులు, అధికారులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -