Wednesday, February 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుకునో పార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన చీతా

కునో పార్కులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన చీతా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ‘గామిని’ అనే చీతా మూడు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. దీంతో దేశంలో చీతాల సంఖ్య 38కి చేరింది. ఈ నెల ప్రారంభంలో నమీబియా నుంచి వచ్చిన ‘ఆశా’ అనే చీతా కూడా ఐదు కూనలకు జన్మనిచ్చింది. భారత్‌లో చీతాల సంతతిని పునరుద్ధరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ చీతా’ను చేపట్టింది. ఈ విజయానికి కృషి చేస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కూడా ఈ వార్తపై హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -