Friday, June 19, 2026
E-PAPER
Homeఆటలుగాయం నుంచి కోలుకుని టీమిండియాలో చేరిన హర్షిత్ రాణా

గాయం నుంచి కోలుకుని టీమిండియాలో చేరిన హర్షిత్ రాణా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గాయం నుంచి కోలుకున్న యువ ఫాస్ట్ బౌలర్, ఆల్ రౌండర్ హర్షిత్ రాణా అఫ్ఘనిస్తాన్‌తో చెన్నై వేదికగా జరగనున్న మూడో వన్డే కోసం భారత జట్టులో చేరాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్‌లో రాణా మోకాలికి గాయం కావడంతో అతను మొత్తం టోర్నమెంట్‌తో పాటు 2026 ఐపీఎల్ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చికిత్స తీసుకున్న అనంతరం కోలుకొని తిరిగి జట్టుతో కలిశాడు.ఈ సిరీస్‌లో ఇప్పటికే భారత్ 2-0 ఆధిక్యంలో ఉన్నందున రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని హర్షిత్ రాణాకు ఫిట్‌నెస్ నిరూపించుకునే అవకాశం కల్పిస్తున్నారు.
వన్డే కోసం టీమిండియా జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణా

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -