Wednesday, February 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంధమల్ల రిజర్వాయర్ తో తీరనున్న నీటి ఎద్దడి

గంధమల్ల రిజర్వాయర్ తో తీరనున్న నీటి ఎద్దడి

- Advertisement -

అందుకు అనుగుణంగా ప్రభుత్వం కసరత్తు  
నవతెలంగాణ – ఆలేరు టౌను 

గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం పనులతో ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, రాజపేట, తుర్కపల్లి మండలంలోని గ్రామాలు గుండాల, మోట కొండూరు, ఆత్మకూరు,  మండలాలలోని గ్రామాలతో పాటు మోత్కూర్ లోని గ్రామాలు కూడా నీటి ఎద్దడి తొలగనుంది.

త్వరలోనే పనులు ప్రారంభించేందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య వడివడిగా అడుగులు వేస్తున్నారు. రిజర్వాయర్ నిర్మాణ విషయంలో నిపుణులను సంప్రదించి, గ్రామాలకు ముప్పు కలగకుండా, 4.28 టిఎంసీలు  ఉన్న సామర్థ్యాన్ని తగ్గిస్తూ, 1, 41 టీఎంసీలకి  తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వాయర్ నిర్మాణ పనులకు 555, 55 కోట్లతో  అనుమతులు మంజూరు చేశారు.

గంధమల్ల రిజర్వాయర్ లో భూములు కోల్పోయిన రైతులకు చెక్కులని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చైతన్య మహేందర్ రెడ్డి  తో కలిసి గంధమల్ల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన రైతులకు, జిల్లా సమీకృత కలెక్టరేట్లో,భూ నిర్వాసితులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి  సమక్షంలో చెక్కులు పంపిణీ చేశారు.

2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మొదటగా 9.36 టీఎంసీల సామర్థ్యంతో, భూసేకరణ, నిర్మాణ పనుల ప్రక్రియను ప్రారంభించింది. పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి వచ్చింది. భూసేకరణలో వచ్చిన సమస్యల దృష్ట్యా 4, 28 టీఎంసీలకు కుదించారు.

రైతుల నుండి వ్యతిరేకత వచ్చిన దృష్ట్యా ప్రభుత్వ మారడంతో గ్రామాల ప్రజల,బాధితుల సూచన, కోరిక మేరకు  రిజర్వాయర్ సామర్ధ్యాన్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనులు ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య జిల్లా కలెక్టర్ హనుమంతరావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి దఫాలుగా సమావేశాలు నిర్వహించి పనులు తొందరగా ప్రారంభించేందుకు కసరత్తు చేశారు. భూములు కోల్పోతున్న బాధిత  రైతులకు అయినా నష్టపరిహారం చెల్లింపులు ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రభుత్వం సిద్ధం అవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.

రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఆలేర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించి నియోజకవర్గన్ని పచ్చటి పంట పొలాలతో సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముందుకు సాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -