నవతెలంగాణ – జుక్కల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులను విద్యార్థులకు గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్ రెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పార్టీ పుస్తకాల్లో నోటుబుక్కులు యూనిఫాంలో పంపిణీ చేయడం వలన విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా.. మధ్యాహ్న భోజన పథకం నిర్విరామంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కొత్త అడ్మిషన్లు ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఇర్ఫాన్ ఆరిఫ్ మరియు పాఠశాల టీచర్ ఎస్కే ముకీద్ , ప్రీ ప్రైమరీ టీచర్ శ్రీదేవి, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పీర్ రెడ్డి, గ్రామ పార్టీ యువ నాయకుడు సుధాకర్ , గ్రామ వార్డు మెంబర్ పూజ జ్ఞానేశ్వర్ , జలీల్ , శ్రీపతి గోండ బాదు నాయక్ , నేరూ సింగ్ , మరియు వివిధ పార్టీ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



