- Advertisement -
నవతెలంగాణ రామగిరి: రామగిరి మండలం బేగంపేట గ్రామ శివారులో గల ఇటుక బట్టి నుండి దుమ్ము, ధూళి వాసన రావడం జరుగుతుందని ఆ గ్రామ సర్పంచ్ మంతెన చంటి ఉపసర్పంచ్ సందెల రేణుక కుమార్ గ్రామ కార్యదర్శి కరుణాకర్ కు వినతి పత్రం ఇచ్చారు.దుమ్ము ధూళి వలన రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారనీ, వాసన వలన గ్రామ ప్రజలు అనారోగ్య బారిన పడుతూ, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని దానిని అరికట్టాలని వారు పేర్కొన్నారు.
- Advertisement -



