నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఈనెల 9న పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా ఈనెల 23న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.మే 4న పొలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టితో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం కాసేపట్లో ముగియనుంది. దీంతో ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశాయి. డీఎంకే, దాని మిత్రపక్షాలు, టీవీకే, కాంగ్రెస్, ఎన్డేయే కూటమి పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించి ఓట్లను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అధినేతలు తమ సొంత నియోజకవర్గాలతో పాటు పార్టీ అభ్యర్థుల అసెంబ్లీ స్థానాల్లోను సుడిగాలి పర్యటనలు చేశారు.
తమిళనాడులో ప్రచార హోరు..
- Advertisement -
- Advertisement -



