నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని( ఆర్టిఐ) స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్లు పి.శ్రీనివాసరావు, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిలు బుధవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి రుద్రపట్ల జయంత్ శర్మ, స్వామి వారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు. అనంతరం ఆలయ ఈఓ కొండపర్తి రాజ్ కుమార్, ఆలయ చైర్మన్ కొర కొప్పుల సత్యనారాయణ గౌడ్, కమిషనర్లను శాలువాతో సన్మానించారు. వారి వెంట ఆర్డిఓ సురేష్, ఆర్ జి-1జిఎం లలిత్ కుమార్, తాహసిల్దార్ పర్నంది సుమన్, ఎంపీడీవో బద్రి శైలజ రాణి, గ్రామ సర్పంచ్ ముస్కుల నరేందర్ రెడ్డి, డైరెక్టర్లు ఎన్ శ్రీనివాసరావు, సెక్రెటరీ బి రమేష్, చింతల రాజిరెడ్డి, రేకుంట్ల రవి, మాటూరు సమ్మయ్య, జనగామ హేమలత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సుందిళ్ల ఆలయంలో ఆర్టిఐ కమిషనర్లు
- Advertisement -
- Advertisement -



