- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హీరో సత్యదేవ్, ఫారియా అబ్దుల్లా జంటగా లక్ష్మినారాయణ పుట్టంచెట్టి దర్శకత్వంలో త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్న కొత్త సినిమా బుధవారం రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సత్యదేవ్ కెరీర్లో ఇది 15వ చిత్రం. దర్శకుడు అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా, నిర్మాత వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉండబోతోందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు తెలిపారు. రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఎస్ఎస్ కాంచి, సురేష్ గురు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
- Advertisement -



