- Advertisement -
హైదరాబాద్ : కంబోడియాలోని కిరిరోమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కెఐటి) వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ హఫీజ్ బాషా నియమితులయ్యారు. 40 ఏళ్ల వయసులోనే ఈ బాధ్యతలు చేపట్టి కంబోడియాలో అతి పిన్న వయస్కుడైన విసిగా ప్రపంచ రికార్డు సృష్టించారు. గతంలో అమెరికాలో అసోసియేట్ విసిగా, తెలంగాణ ప్రభుత్వ ఐటి శాఖ సలహాదారుగా పనిచేశారు. ఈ విజయాన్ని గిన్నిస్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేయనున్నట్లు భారత వ్యాపారవేత్త కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -



