- Advertisement -
హైదరాబాద్ : ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) పటాన్చెరులో యోగా ఉత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం పాల్గొన్న ఈ కార్యక్రమంలో యోగా ప్రాముఖ్యతపై పలువరు వక్తలు సందేశాలు ఇవ్వగా.. విద్యార్థి రిషాన్ యోగా ప్రయోజనాలపై చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. విద్యార్థుల సమూహ యోగా ప్రదర్శన కార్యక్రమానికి ప్రత్యేకంగా నిలిచింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేశారు. ఆరోగ్యకరమైన, సమతుల జీవన విధానానికి యోగా ఎంతో అవసరమనే సందేశాన్ని అందించారు.
- Advertisement -



