Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ బంకలక్ష్మి 

రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ బంకలక్ష్మి 

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామం నుండి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు పనులను శుక్రవారం  గ్రామ సర్పంచ్ బంక లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి మాట్లాడుతూ.. రోడ్డు నిర్మాణానికి రూ .2 కోట్ల 53 లక్షల నిధులు మంత్రి పొన్నం ప్రభాకర్  నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిధుల మంజూరు చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ పొలు రాజు, వార్డ్ మెంబర్ బోంగోని రేణుక, రమేష్ ,కొంగరి స్వరూప తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -