Monday, June 22, 2026
E-PAPER
Homeక్రైమ్ఎలక్ట్రిక్ బస్సులో మంటలు

ఎలక్ట్రిక్ బస్సులో మంటలు

- Advertisement -

డ్రైవర్ అప్రమత్తతతో 42 మంది 
ప్రయాణికులు సురక్షితం
నవతెలంగాణ – తిమ్మాపూర్

కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం రాజీవ్ రహదారిపై అగ్నిప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా బస్‌‌స్టాండ్‌ రెండో డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఆదివారం ఉదయం 8 గంటలకు 42 మంది ప్రయాణికులతో కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అలుగునూరు దాటి కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే బస్సులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్ బోయిని ప్రశాంత్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన ఆపాడు. ప్రధాన ద్వారంతో పాటు అత్యవసర ద్వారాలను తెరిచి ప్రయాణికులందరిని సురక్షితంగా కిందికి దించాడు. అనంతరం బస్సులోని అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడి పెను ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -