నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని సహస్రర్జున్ ఆత్మీయ మిత్రమండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఇటీవలే మున్సిపల్ ఎన్నికలలో కౌన్సిలర్లుగా గెలుపొందినటువంటి దోండి ఈశ్వర్, డార్లింగ్ రమేష్, ఖాందేశ్ ప్రశాంత్ లను ఘనంగా సన్మానించి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్స్ మాట్లాడుతూ.. వారి వారి వార్డులలో అన్ని రకాల అభివృధి పనులు పోట పోటీగా చేస్తామని తెలిపారు. అదేవిధంగా వార్డులను అత్యంత సుందరీకరణ చేస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో లయన్ గుజరాతి నివేదను, సహస్రర్జున్ ఆత్మీయ మిత్రమండలి సభ్యులు విద్య ప్రవీణ్, సత్పుతే శ్రీనివాస్, డీజే దయానంద్, జేస్సు ఆనంద్, బొచ్కర్ వేణు,వండర్ రాజేష్,సంతని విజయ్,ఖాందేశ్ ప్రవీణ్,గంగాకిషన్, అల్జాపూర్ రాజేష్, అంతాజి ఆనంద్, అల్జాపూర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ లకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



