- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిజామాబాద్ జల్లా బోధన్ మండలం ఉట్పల్లిలో విషాదం చోటుచేసుకొంది. దంపతులు జ్యోతి, సంజీవ్లు ఉతికిన దుస్తులు ఆరవేస్తుండగా, విద్యుత్తు తీగలు తగలడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సమాచారం అందుకొన్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



