- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలోని పత్తి రైతులకు (Telangana, Cotton Farmers) కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) తీపికబురు చెప్పింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar rao) అభ్యర్థన మేరకు పత్తి కొనుగోళ్లను ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ సీసీఐ తాజాగా నిర్ణయం తీసుకుంది. మంత్రి ఆదేశాలతో నిన్న వ్యవసాయశాఖ జాయింట్ సెక్రటరీ, కేంద్ర జౌళి శాఖకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం, సీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి తుమ్మల సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా కనుగోళ్లు పొడిగించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



