- Advertisement -
పెద్దతూండ్ల సర్పంచ్ బండారి నర్సింగం
నవతెలంగాణ – మల్హర్ రావు
అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని పెద్దతూoడ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం అన్నారు. పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ రావు పల్లి జోడు వెంకటస్వామి కుమార్తె జోడు అక్షిత అనారోగ్యంతో ఇటీవల మృతిచెందింది. శనివారం గ్రామ సర్పంచ్ పరమార్షించి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బియ్యని రాజమౌళి, జంబోజు సంధ్యారాణి రవీందర్, తాటికొండ కేశవ చారి, బియ్యని శ్రీవాణి కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



