నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గ్రామాలలో గ్రామ సంఘాల రుణాల మంజూరులో ఎటువంటి సమస్యలు రాకుండా సీసీలు బాధ్యతగా పనులు నిర్వహించాలని జిల్లా పరిషత్ సీఈఓ చంద్ర నాయక్ అన్నారు. మంగళవారం ఈ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ మాట్లాడుతూ .. ఎన్ని గ్రామ సంఘాలకు శ్రీనిధి రుణాలు మంజూరు చేశారని రికార్డులను పరిశీలించారు.
గ్రామాలలో సక్రమంగా సంఘాలు నడిపే విధంగా సభ్యులకు ప్రోత్సాహకంగా సీసీలు విధులు నిర్వహించాలని అన్నారు. విధి నిర్వహణలో ఔకతవకలు పాల్పడితే ఊరుకునేది లేదని చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుణాల మంజూరులో బ్యాంకులో తో చర్చించి అర్హులైన సంఘాలకు శ్రీనిధి రుణాలను అందించే విధంగా అధికారులు గ్రామ సంఘాల సభ్యులకు తోడ్పాటు అదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ తో పాటు జిల్లా పరిషత్ శ్రీనీధీ జిఎం , జుక్కల్ మండల సీసీలు. సిబ్బంది స్వరూప తదితరులు పాల్గొన్నారు.



