- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జార్జియా దేశ పార్లమెంట్లో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రధాని ఇరాక్లీ కొబఖిడ్జే వార్షిక ప్రభుత్వ నివేదికను సమర్పించిన అనంతరం, ప్రశ్నోత్తరాల సమయంలో ‘జార్జియన్ డ్రీమ్’, ‘ఫర్ జార్జియా’ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఎంపీలు ఒకరి షర్ట్లు మరొకరు పట్టుకుని పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
- Advertisement -



