- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆకస్మిక గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1953లో ఈరోడ్ జిల్లా వెల్లాంకోయిల్లో జన్మించిన భాగ్యరాజ్, ప్రముఖ దర్శకుడు భారతిరాజా వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించి, అనంతరం నటుడిగా, దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. మొత్తం 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్, 25 సినిమాలకు దర్శకత్వం వహించారు.
- Advertisement -



