- Advertisement -
నవతెలంగాణ-హైదారాబాద్: ఖలిస్తానీ ఉగ్రవాదులు దేశంలో దాడులు చేయనున్నట్లు నిఘా వ్యవస్థలు కీలక హెచ్చరికలు చేశాయి. ఢిల్లీ , ఉత్తరాఖండ్లోని కీలక ప్రదేశాలే లక్ష్యంగా ఈ దాడులు జరగనున్నట్లు సమాచారం అందిందని నిఘా వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, పోలీసు కేంద్రాలు కూడా లక్ష్యాలుగా మారవచ్చని పేర్కొన్నారు. అనేక ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రాజకీయ నాయకులను లక్ష్యాలుగా ప్రస్తావిస్తూ వచ్చిన ఒక ఈమెయిల్ ద్వారా ఈ ముప్పు సమాచారం అందిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ హెచ్చరిక నేపథ్యంలో, ఢిల్లీ , ఉత్తరాఖండ్ పోలీసులు, నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
- Advertisement -



