- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ జులై 2న కాలేజీల బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రూ. 7 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ ఐకాస ఛైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
- Advertisement -



