పాఠ్యాంశాల్లో సైన్స్కు బదులు సూడో సైన్స్
ప్రజల్ని అశక్తుల్ని చేస్తున్న పాలకులు
మరో పీపుల్స్ సైన్స్ మూమెంట్ రావాలి : ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గౌహార్ రజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత దేశంలో విజ్ఞానం ప్రమాదంలో పడిందని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గౌహార్ రజా ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జన విజ్ఞాన వేదిక(జేవీవీ) ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగిం చారు. భారత స్వాతంత్య్రం తర్వాత మొదటి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందుకు పోవాలని అనేక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. 70 ఏండ్ల పాటు దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలకు పాలకులు పెద్దపీట వేశారన్నారు. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత సైన్స్ కాస్త సూడో సైన్స్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 తర్వాత ఈ ధోరణి పరాకాష్టకు చేరిందని అన్నారు. గోవు మూత్రంతో క్యాన్సర్ నయమవుతుందనీ, పేడతో బంగారం తయారు చేయొచ్చనీ, చప్పట్లు కొడితే కరోనా పోతుందని పాలకులు ప్రజలను అజ్ఞానం వైపు తీసుకెళుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ భవిష్యత్కు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భావవాదం, జాతీయ వాదం పేరుతో ప్రజలను భావోధ్వేగాల్లో బందీ చేస్తున్నారని విమర్శిం చారు. ఫలితంగా విద్యార్థులు, ప్రజలు, మేధావులు ప్రశ్నించ డాన్ని మర్చిపో తున్నారని పేర్కొన్నారు. దేశంలో విజ్ఞానాన్ని బతికిం చాలంటే పీపుల్స్ సైన్స్ మూవెంట్ రావాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లా డుతూ భౌతిక, భావవాదాలకు, మతాన్ని జోడించి దేశంలోని విద్యావ్యవస్థను పాలకులు గందరగోళానికి గురి చేస్తున్నారని అన్నారు. శారీరక, మానసిక ఒత్తిడి తేవడం ద్వారా ప్రజలను సృష్టివాదం వైపు నెడుతున్నారని ఆరోపించారు. ఫలితంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 120లో మన దేశం 102 స్థానంలో ఉందని గుర్తు చేశారు. శాస్త్ర, సాంకేతిక, అభ్యుదయ రంగాల్లో ఎవరైతే పురోగతి సాధిస్తారో వారే ప్రపంచంలో ప్రముఖ స్థానానికి చేరుకుంటారని అన్నారు. చార్వాకుడు, ఆర్యభట్ట లాంటి శాస్త్రవేత్తలు పుట్టిన ఈ దేశం నేడు సైన్స్లో వెనకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రంథాలయ సంస్థ చైర్మెన్ డాక్టర్ రియాజ్ మాట్లాడుతూ భారత దేశమైనా, తెలంగాణ అయినా నేడు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొందని అన్నారు. టెక్నాలజీ వినియోగం పెరిగినా సైన్స్ మాత్రం తగ్గిందని అభిప్రాయపడ్డారు. జేవీవీ కో కన్వీనర్ డాక్టర్ పి.రజని మాట్లాడుతూ సైంటిఫిక్, సోషల్ రంగాల్లో మహిళలు వెనకబడి పోతున్నారని అన్నారు. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం గణాం కాల ప్రకారం అన్ని రంగాల్లో పురుషుల కంటే మహిళలు 10 నుంచి 20 శాతం వెనకబడి ఉన్నారని గుర్తు చేశారు. ఇది సమాజ శ్రేయ స్సుకు మంచిది కాదని అబి óప్రాయపడ్డారు. సైన్స్ను బతికించేందుకు జన విజ్ఞాన వేదిక ముందుకు రావాలని కోరారు. ఈ కార్య క్రమంలో జేవీవీ ప్రధాన కార్యదర్శి రాజారాజా తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదంలో ”విజ్ఞానం”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



