- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్ దివంగత సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆయన భౌతికకాయాన్ని రాజధాని టెహ్రాన్లోని గ్రాండ్ మొసల్లా మసీదులో ఉంచారు. ఈక్రమంలో ఆ దేశ నలుమూలాల నుంచి ప్రజలు తరలివచ్చారు. ఖమేని పార్ధివ దేహాన్ని కడసారి చూడడానికి కిలో మీటర్ల మేర క్యూలైన్ వేచి ఉన్నారు. అదే విధంగా దేశ విదేశీ ప్రతినిధులు, అధికారులు ఆయన భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు.జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. మరో వైపు భద్రతా కారణాల దృష్ట్యా, ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజాతబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియలకు హాజరుకావడం లేదు.


- Advertisement -



