Wednesday, March 4, 2026
E-PAPER
Homeఖమ్మంమల్లాయిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ సేవా శిబిరం 

మల్లాయిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ సేవా శిబిరం 

- Advertisement -

– విద్యార్థుల సేవాస్ఫూర్తిని కొనియాడిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ ఆధ్వర్యంలో మండలం లో ని మల్లాయిగూడెంలో నిర్వహించిన జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను కూడా ఒకప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా పనిచేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.ఎన్ఎస్ఎస్ శిబిరం ముగిసిన తర్వాత కూడా విద్యార్థులు సేవా దృక్పథాన్ని కొనసాగించాలని సూచించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్‌లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ కావ్యను అభినందించి సన్మానించారు.గ్రామంలో విద్యార్థులు నిర్వహించిన సర్వే ఆధారంగా మల్లాయిగూడెం గ్రామ అభివృద్ధికి తగిన సహాయం అందిస్తానని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా విద్యార్థులు వ్యవసాయ సాంకేతికతలపై స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలు నిర్వహించారు.అలాగే మాదకద్రవ్యాల వినియోగంపై విద్యార్థులు చేసిన సందేశాత్మక నాటక ప్రదర్శన గ్రామ ప్రజలను ఆకట్టుకుంది.

కార్యక్రమంలో భాగంగా అసోసియేట్ డీన్ డా. హేమంత కుమార్ వారం రోజులుగా విద్యార్థులు గ్రామంలో నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాలపై నివేదికను ఎమ్మెల్యేకు అందించారు.

ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డి.స్రవంతి, డాక్టర్ ఝాన్సీ రాణి, డాక్టర్ శ్రీజన్, విద్యార్థులు విజయవంతంగా నిర్వహించారని అసోసియేట్ డీన్,కళాశాల సిబ్బంది ప్రశంసించారు. గ్రామ రైతులు కూడా విద్యార్థులు చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -