- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. బుధవారం సుమారు 5 గంటల నుంచి మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఇటీవల అరెస్టు చేసిన ముగ్గురు నిందితులకు మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? వారి నెట్వర్క్ ఎంత వరకు విస్తరించింది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్ పరికరాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని కీలక రాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
- Advertisement -



