- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్ ఘటన విషాదాంతంగా ముగిసింది. పైలట్ల శిక్షణలో భాగంగా నిన్న సాయంత్రం గాల్లోకి లేచిన సుఖోయ్ ఫైటర్ జెట్ కాసేపటికే కూలిపోయిందని వాయుసేన అధికారులు ధ్రువీకరించారు. అసోంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ (Su-30 MKI) యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారని అధికారికంగా ప్రకటించింది. మరణించిన వారిని స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్ గా గుర్తించినట్లు పేర్కొంది.
- Advertisement -



