- Advertisement -
నవతెలంగాణ – చండూర్
చండూరు పట్టణంలోని పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలకు శుక్రవారం విద్యుత్ రిటైర్డ్ లైన్ ఇన్ స్పెక్టర్ యండి నిరంజన్ అలీ ఆధ్వర్యంలో చండూరు ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అనంతరం మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ అవతరించింది రంజాన్ నెలలోనే అని సమస్త మానవాళికి మార్గ నిర్దేశకంగా కులమతాలకు అతీతంగా రంజాన్ పండుగను జరుపుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మత గురువు ముజాహిద్, కమ్రుద్దీన్, జిన్నా, ఖలీల్,కరెంటు షరీఫ్ పాష ,జావేద్, బాబా, హైమద్, గౌస్, ఉమర్ ,జన్ను, షజ్జు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



