- Advertisement -
మషాద్ : అమెరికా-ఇజ్రాయిల్ దాడులలో ప్రాణాలు కోల్పోయిన ఇరాన్ మాజీ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులకు లక్షలాది మంది ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఖమేనీ స్వస్థలమైన మషాద్లోని ఇమామ్ రెజా వీధి మీదుగా గురువారం సాయంత్రం సాగిన అంతిమ ఊరేగింపు ఇమామ్ రెజా పవిత్ర మందిరం వరకూ సాగింది. ఖమేనీకి తుది వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వీధులలో బారులు తీరారు. ఇమామ్ రెజా వీధి, మందిరానికి చెందిన కోర్ట్యార్డులు ప్రజలతో కిక్కిరిసిపోయాయి.
- Advertisement -



