నవతెలంగాణ-ఆలేరు టౌన్ : యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో ఆలేరు నియోజకవర్గ రహదారుల విస్తరణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన ,తెలంగాణ రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించారు. ఆలేరు పట్టణ అభివృద్ధి కొరకు తగిన విధంగా నిధులు కేటాయించాలని కోరారు. స్టేషన్ ఘన్పూర్ , పాలకుర్తి ఎమ్మెల్యే లని కడియం శ్రీహరి ,పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ని మర్యాదపూర్వక కలిసి శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బీజన బాలమణి భాస్కర్ కౌన్సిలర్లు మరియమ్మ మార్కు,పస్తం ఆంజనేయులు ,జట్ట నీరజ-సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి నిధులు కోరుతూ మంత్రిని కలిసిన మున్సిపల్ చైర్మన్ బాలమణి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


