పోలీసులను అభినందించిన పట్టణ సీఐ
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని స్టేషన్ రోడ్డులో డీసీబీ బ్యాంక్ ఎదుట ఆదివారం సాయంత్రం ఓ మహిళ మెడలోని బంగారు తాడును లాక్కొని పారిపోతున్న వ్యక్తిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం సుమారు 4:15 గంటల సమయంలో స్టేషన్ రోడ్డులోని డీసీబీ బ్యాంక్ ముందుగా సుమారు 55 ఏళ్ల మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా, ఒక వ్యక్తి ఆమె వెనుకనుంచి వచ్చి మెడలో ఉన్న బంగారు చైన్ను లాక్కొని పారిపోవడానికి వ్యక్తి ప్రయత్నించగా, అదే సమయంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బీసీ -1 డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు మధు ( పి సి – 2530), కళ్యాణ్ ( పి సీ – 2918) ఈ ఘటనను గమనించి వెంటనే నిందితుడిని వెంబడించారు. కొద్దిదూరం తరుముకుని అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, బంగారు చైన్తో సహా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్యూటీలో సమయస్ఫూర్తితో వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న బి సి – 1 సిబ్బంది మధు, కళ్యాణ్లను కామారెడ్డి పట్టణ సీఐ నరహరి అభినందించారు.
చైన్ స్నాచర్ను వెంటాడి పట్టుకున్న పోలీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



