నవతెలంగాణ-హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో నార్వే టీం ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ చేతిలో 2-1తో పోరాడి పరాజయం పొందింది. అయితే స్వదేశం తిరిగి వచ్చిన పుట్ బాల్ టీంకు ఆదేశ వాసులు ఘనం స్వాగతం పలికారు. సుమారు లక్షకు పైగా నార్వే రాజధాని ఓస్లోకు చేరుకున్నారు. సాంప్రదాయ జల ఫిరంగులతో ఘన స్వాగతం పలికారు. వేలాది మంది అభిమానులు రాజభవనం చుట్టూ గుమిగూడి, నగరం ప్రధాన రహదారి అయిన కార్ల్ జోహన్స్ గేట్ వద్ద బారులు తీరారు. ఆటగాళ్లు మొదట కింగ్ హెరాల్డ్ను కలుసుకుని, ఆపై రాజభవనం మెట్లపై నుండి మద్దతుదారులకు అభివాదం తెలిపారు. ఈ వేడుకలలో చివరి “వైకింగ్ రో” ప్రదర్శన జరిగింది, ఇందులో యువరాజు హాకాన్ డ్రమ్స్పై సాంప్రదాయ గీతాన్ని ఆలపించారు. అయితే, స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ విమానం ఎక్కడానికి ముందుగానే బయలుదేరడంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కాగా, మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు ఫైనల్ బెర్త్కోసం తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో అర్జెంటీనా జట్టు ఇంగ్లండ్తో పోటీపడనుంది.
FIFA World Cup: లక్షమందితో నార్వే టీంకు వెల్ కమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



