- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ ఏడాది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కింద ఎస్సీ విద్యార్థులకు బోదనా రుసుములు, మెయింటెనెన్స్ ఛార్జీలను రూ.374 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. 2024-25 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60, 40 నిష్పత్తిలో నిధులు ఇస్తున్నాయి. ఈ ఏడాది 83,239 మంది ఎస్సీ విద్యార్థులకు అందజేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.173 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా కింద రూ.201 కోట్లు విడుదల చేసినట్టు ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- Advertisement -



