- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మైబాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాలమేరకు గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.10 లక్షల నిధులతో సీసీరోడ్డు పనులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ మందిర్ నుండి కాశిరాం ఇల్లు వరకు సీసీరోడ్డు వేస్తామని చెప్పారు. ఈ కార్య క్రమంలో గ్రామ సర్పంచ్ బశవ్వ అశోక్ , వార్డు మెంబర్ పూజ జ్ఞానేశ్వర్ , యువ నాయకుడు అశోక్ బాదు నాయక్ , ఉల్రమ్, కైలాష్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



