చింతలపాలం మండలంలో ఘటన
నవతెలంగాణ- చింతలపాలెం
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం చింతిర్యాల వద్ద కృష్ణా నదిలో మంగళవారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతిర్యాల గ్రామానికి చెందిన సయ్యద్ హుస్సేన్ కుమారులు సమీర్(15,) సద్దాం(13) ఏపీ రాష్టం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని ఉర్దూ పాఠశాలలో చదివేవారు. రంజాన్ మాసం కావడంతో స్వగ్రామానికి వచ్చారు. మంగళవారం తల్లి మిరపకాయలు కోయడానికి వెళ్లగా.. ఇద్దరు పిల్లలు గేదెలను మేపేందుకు కృష్ణానది తీరానికి వెళ్లారు. అక్కడ నది ఒడ్డున ఈతకు దిగారు.
ప్రమాదవ శాత్తు ఇద్దరూ నీటిలో మునిగి గల్లంతయ్యారు. మధ్యాహ్నం సమయంలో తల్లి కృష్ణా నది వద్దకు వెళ్లి చూడగా ఇద్దరు కుమారులు కనిపించకపోవడంతో గ్రామస్తులకు, అధికారులకు సమా చారం ఇచ్చారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరు బాలురు ల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లలూ మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కృష్ణానదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



