- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సిక్కింలోని నామ్చి జిల్లాలో సమర్డంగ్ సైట్లో నిర్మాణంలో ఉన్న టన్నెల్పై కొండచరియ విరిగిపడటంతో మూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మరణించారని, పలువురు లోపలే చిక్కుకుపోయి ఉంటారని అధికారులు తెలిపారు. భారీ కొండచరియ విరిగిపడటంతో సొరంగం ప్రవేశద్వారం మూసుకుపోయింది. కొండచరియ విరిగిపడటం వల్ల మీథేన్ గ్యాస్ లీక్ అవడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. మృతదేహాలను సింగ్టమ్ జిల్లా ఆసుపత్రి, గాంగ్టక్లోని ఎస్టిఎన్ఎం ఆసుపత్రి, నామ్చి జిల్లా ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



