- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన..ప్రగతిబిప్రణాళిక కార్యక్రమాన్ని పల్లెల్లో పక్కాగా అమలు చేయాలనే నేపథ్యంలో మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతిరోజు గ్రామంలో పారిశుధ్యం, అంతర్గత రోడ్లు పరిశుభ్రం, డ్రైనేజీల్లో చెత్తాచెదారం తొలగింపు, మంచినీటి ట్యాoకులు శుభ్రం తదితర పనులు చేస్తున్నారు. ఆదివారం పంచాయతీ కార్మికులను సర్పంచ్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భాస్కర్ రెడ్డి,వార్డు సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



