- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడుల వల్ల ఇరాన్ భారీగా నష్టపోతోందని, ఆ దేశానికి శాశ్వత నష్టం కలిగించడానికి చర్యలు తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఇప్పుడే యుద్ధం ఆపినా ఇరాన్ పునర్నిర్మాణానికి 10 ఏళ్లు పడుతుందని, మళ్లీ కోలుకోలేని విధంగా నష్టం కలిగించడమే తమ లక్ష్యమని, ఇరాన్పై దాడులు ఇంకా ముగియలేదని ఆయన వెల్లడించారు. మరో రెండు వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని, తాము ముందస్తు దాడులు ప్రారంభించకపోయి ఉంటే ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసేదని తెలిపారు.
- Advertisement -



