Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలకు కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

ప్రజలకు కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు లక్షణాలు పరాభవం చెంది మంచితనం విజయం సాధించాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం పునర్‌వైభవాన్ని సంతరించుకుని, ప్రగతి పథాన పయనించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ పనులను నూతనంగా పున్ణ ప్రారంభం చేసుకునే రైతు నామ సంవత్సరంగా ఉగాది పండుగ ప్రత్యేకతను సంతరించుకున్నదని తెలిపారు. ప్రకృతి మాత శిశిరాన్ని వీడి, కొత్త చిగురులతో వసంతాన్ని ఆహ్వానిస్తూ, నూతన ఆశలకు, సంకల్పాలకు నాంది పలుకుతుందనీ, ఉగాది నుంచి కాలచక్రం పునరావృతమౌతుందని పేర్కొన్నారు.

ద్వేష భావనలు, అహంకారం, తదితర చెడు లక్షణాలు పరాభవం చెంది వాటి స్థానంలో ఉన్నతమైన ఆశయాలు వృద్ధి చెంది, మనిషి సమున్నతమైన మార్గాన్ని అనుసరించాలనే తాత్వికతను శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది తెలియజేస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు సమస్యలు పరాభవం చెంది అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండి రాష్ట్రం పునర్‌వైభవం సాధించి విజయం వైపు సాగాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -