Sunday, March 22, 2026
E-PAPER
Homeఖమ్మంఅశ్వారావుపేట నియోజకవర్గంలో రైతు భరోసా జోరు

అశ్వారావుపేట నియోజకవర్గంలో రైతు భరోసా జోరు

- Advertisement -

– 45,456 మంది రైతులకు రూ.25.39 కోట్ల ఆర్థిక సాయం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హర్షం 
నవతెలంగాణ – అశ్వారావుపేట

రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం అశ్వారావుపేట నియోజకవర్గంలో విశేష ఫలితాలు ఇస్తోంది అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ హర్షం వ్యక్తం చేశారు.  ఈ పథకం కింద నియోజకవర్గంలోని మొత్తం 45,456 మంది రైతులకు రూ.25.39 కోట్ల ఆర్థిక సహాయం మంజూరైంది అని అన్నారు.

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం, రైతులపై పెట్టుబడి భారం తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం సాగు ప్రారంభ సమయంలో రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది. సమయానికి పెట్టుబడి సాయం అందడం వల్ల రైతులు అప్పుల భారాన్ని తగ్గించుకోగలుగుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

మండలాల వారీగా లబ్ధిదారులు – ఆర్థిక సాయం వివరాలు:
అన్నపురెడ్డిపల్లి మండలం: 4,838 మంది రైతులు – రూ.2.63 కోట్లు
అశ్వారావుపేట మండలం: 12,950 మంది రైతులు – రూ.7.34 కోట్లు
చంద్రుగొండ మండలం: 6,067 మంది రైతులు – రూ.3.26 కోట్లు
దమ్మపేట మండలం: 11,272 మంది రైతులు – రూ.6.31 కోట్లు
ములకలపల్లి మండలం: 10,329 మంది రైతులు – రూ.5.86 కోట్లు

ఈ పథకం ద్వారా ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి ఇది బలమైన ప్రోత్సాహకంగా మారుతుందని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన దిగుబడులు సాధించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -