Monday, March 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంచ‌మురు కేంద్రాల‌పై దాడులు..ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద ముప్పు: ఐఏఈ

చ‌మురు కేంద్రాల‌పై దాడులు..ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద ముప్పు: ఐఏఈ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫిబ్ర‌వ‌రి 28న మొద‌లైన ప‌శ్చిమాసియా యుద్ధం అనేక న‌ష్టాల‌ను మోసుకొస్తుంది. ఇజ్రాయిల్-అమెరికా దేశాలు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నాయి. మూడు వారాల‌కు పైగా కొన‌సాగిన యుద్ధం అనేక సంక్షోభాల‌కు తెర‌లెపాయి. హ‌ర్మూజ్ జ‌ల‌సంధితో మూసివేత‌తో ఇప్ప‌టికే గ్యాస్ స‌ర‌ఫ‌రా స్తంభించి ప‌లు దేశాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. అయితే యూఎస్-ఇజ్రాయిల్ అణు బూచిని సాకుగా చూపుతూ ఇరాన్ అణు కేంద్రాల‌తో పాటు చ‌మురు కేంద్రాల‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో త్వ‌ర‌లో ఇంధ‌న సంక్షోభాన్ని ప్ర‌పంచం చ‌విచూడ‌నుంది. ఇప్ప‌టికే ముడి చ‌మురు ధ‌ర‌లు రోజుకురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ అల‌ర్ట్ అయింది. అధిపతి ఫాతిహ్‌ బిరోల్ కీల‌క హెచ్చ‌రిక‌లు చేశారు.

‘‘1970ల్లో, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పుడు చవిచూసిన చమురు, గ్యాస్ సంక్షోభాలను మించిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతిపెద్ద ముప్పును ఎదుర్కొంటోంది (Energy crisis). సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. పశ్చిమాసియాలో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతింటే.. ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల పైనా తీవ్రంగా ఉంటుంది. దాంతో ధరల్లో అస్థిరత, సరఫరా కొరతకు దారితీస్తుంది’’ అని హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆర్థికవ్యవస్థలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మందగిస్తోన్న వృద్ధితో సతమతమవుతున్నాయి. ఈ సమయంలో ఆయన హెచ్చరికలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులు ఈ ఆయిల్‌, గ్యాస్‌ షాక్‌లన్నింటిని మిళితం చేసి.. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు. ఈ అనిశ్చితి నుంచి బయటకు వచ్చేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు అత్యవసరమని ప్రపంచ దేశాలకు సూచించారు.

చ‌మురు కేంద్రాల‌పై దాడులు..ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద ముప్పు: ఐఏఈ

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫిబ్ర‌వ‌రి 28న మొద‌లైన ప‌శ్చిమాసియా యుద్ధం అనేక న‌ష్టాల‌ను మోసుకొస్తుంది. ఇజ్రాయిల్-అమెరికా దేశాలు మిడిల్ ఈస్ట్‌లో యుద్ధోన్మాదంతో రెచ్చిపోతున్నాయి. మూడు వారాల‌కు పైగా కొన‌సాగిన యుద్ధం అనేక సంక్షోభాల‌కు తెర‌లెపాయి. హ‌ర్మూజ్ జ‌ల‌సంధితో మూసివేత‌తో ఇప్ప‌టికే గ్యాస్ స‌ర‌ఫ‌రా స్తంభించి ప‌లు దేశాల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. అయితే యూఎస్-ఇజ్రాయిల్ అణు బూచిని సాకుగా చూపుతూ ఇరాన్ అణు కేంద్రాల‌తో పాటు చ‌మురు కేంద్రాల‌పై దాడులు చేస్తున్నాయి. దీంతో త్వ‌ర‌లో ఇంధ‌న సంక్షోభాన్ని ప్ర‌పంచం చ‌విచూడ‌నుంది. ఇప్ప‌టికే ముడి చ‌మురు ధ‌ర‌లు రోజుకురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ అల‌ర్ట్ అయింది. అధిపతి ఫాతిహ్‌ బిరోల్ కీల‌క హెచ్చ‌రిక‌లు చేశారు.

‘‘1970ల్లో, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పుడు చవిచూసిన చమురు, గ్యాస్ సంక్షోభాలను మించిన పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతిపెద్ద ముప్పును ఎదుర్కొంటోంది (Energy crisis). సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. పశ్చిమాసియాలో ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతింటే.. ఆ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ల పైనా తీవ్రంగా ఉంటుంది. దాంతో ధరల్లో అస్థిరత, సరఫరా కొరతకు దారితీస్తుంది’’ అని హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆర్థికవ్యవస్థలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, మందగిస్తోన్న వృద్ధితో సతమతమవుతున్నాయి. ఈ సమయంలో ఆయన హెచ్చరికలు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులు ఈ ఆయిల్‌, గ్యాస్‌ షాక్‌లన్నింటిని మిళితం చేసి.. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ప్రమాదంలోకి నెడుతున్నాయన్నారు. ఈ అనిశ్చితి నుంచి బయటకు వచ్చేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు అత్యవసరమని ప్రపంచ దేశాలకు సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -