- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అక్రమాలను అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా వాడుకలో ఉన్న పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో పీవీసీ, ఏటీఎం తరహా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త కార్డులు క్యూఆర్ కోడ్, కుటుంబ యజమాని ఫోటోతో ముద్రించబడి ఉంటాయి. ఇప్పటికే అన్ని జిల్లాల పౌరసరఫరాల కార్యాలయాలకు చేరుకున్న ఈ స్మార్ట్ కార్డులను, ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
- Advertisement -



