- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర వైభవంగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు సీఎంకు మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున బంగారు బోనం, పట్టు వస్త్రాలు సమర్పించారు. పలువురు ప్రముఖులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
- Advertisement -



