- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు చెందిన 17 ఏళ్ల తన్వి శర్మ అదరగొట్టింది. వియత్నాంకు చెందిన థుయ్ లిన్ను 21-16, 21-16 తేడాతో వరుస సెట్లలో ఓడించి టైటిల్ నెగ్గింది. దీంతో భారత్కు 18 ఏళ్ల తర్వాత తైపీ ఓపెన్ టైటిల్ను అందించింది. తన్వికిదే తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 300 టైటిల్. గతంలో 2008లో తైపీ ఓపెన్లో మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ విజేతగా నిలిచింది.
- Advertisement -


