నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డిని తెలంగాణ ఇంటర్మీ డియెట్ గవర్న మెంట్ లెక్చరర్ల అసోసియేషన్ (టిగ్లా)అధ్యక్షులు మైలారం జంగయ్య ,ప్రధాన కార్యదర్శి మాచర్ల రామకృష్ణ గౌడ్ నేతృత్వంలో గురువారం హైదరాబాద్లోని సచివాలయ ంలో కలిసి శుభాకాంక్షలు తెలి పారు. అంతకు ముందు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజాను మర్యాద పూర్వకంగా కలిసి అభినందన లు ప్రకటించారు. ప్రభుత్వ కాలేజీల బలోపేతం కోసం చర్యలు తీసుకోవా లని కోరారు. టిగ్లా జాయింట్ సెక్రెటరీలు బండారి లక్ష్మయ్య, మంజు నాయక్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గిల్ల పరశురాములు, నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.