Wednesday, March 25, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాకిస్థాన్‌కు ఇరాన్ భారీ షాక్

పాకిస్థాన్‌కు ఇరాన్ భారీ షాక్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పాకిస్థాన్‌కు ఇరాన్ భారీ షాకిచ్చింది. పాక్‌కు వెళ్తున్న ఒక కంటైనర్ షిప్‌ను హార్ముజ్ జలసంధి దాటకుండా ఇరాన్ దళాలు నిలిపేశాయి. యూఏఈ షార్జా నుంచి కరాచీ వైపు వెళ్తున్న ఈ నౌకను నిలిపేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది.

అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ జలసంధి గుండా వెళుతుంది. యుద్ధం మొదలైన తర్వాత ఈ మార్గంలో వెళ్తున్న ట్యాంకర్లను ఇరాన్ టార్గెట్ చేస్తోంది. దీంతో నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ మార్గం గుండా ఏ నౌక ప్రయాణించడానికైనా ఇరాన్ అనుమతి, సమన్వయం అవసరమని చెప్పారు. హార్ముజ్ గుండా స్వేచ్ఛాయుత నౌకయానాన్ని తామే నిర్వహిస్తామని ఇరాన్ ప్రకటించింది. శత్రువులతో సంబంధం లేని నౌకల్ని అనుమతిస్తున్నాట్లు ఇరాన్ ఇటీవల ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -