- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘క్షుద్రపూజలు’ అనే వ్యాఖ్యలపై స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు బయటపెడుతున్నాననే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. రాజకీయాల్లో విమర్శలకు హద్దు పద్దు ఉంటుందని చెప్పారు. గతంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, తన విషయంలో కూడా క్రిమినల్, డిఫమేషన్ సూట్లు వేస్తానని, ఇప్పటికే లీగల్ నోటీసులు పంపానని తెలిపారు. నాలుక ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
- Advertisement -



