నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి.జులై 20న యువతపై ఢిల్లీ పోలీసుల చర్యపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంతో, నినాదాల మధ్య పార్లమెంటు ఉభయ సభలను ఆగస్టు 10న ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. అయోధ్య రామ్ మందిర్ విరాళాల చోరీ పై పార్లమెంట్ లో చర్చ పెట్టాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాని మోడీ, అమిత్ షా పార్లమెంట్ ఎందుకు రావడంలేదని మండిపడుతున్నారు విపక్ష సభ్యులు. సభలో గందరగోళం నెలకొనడంతో, రాజ్యసభ ఛైర్పర్సన్ సి.పి. రాధాకృష్ణన్ అధికార, ప్రతిపక్ష శిబిరాలు రెండూ తమ స్థానాల్లో కూర్చోవాలని కోరారు. అయిన కూడా సభ రూలింగ్ లోకి రాకపోవడంతో వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభను ఆగస్టు 10కి వాయిదా వేశారు.
పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



