అంగరంగ వైభవంగా శ్రీ సీతా రాముల కల్యాణ మహోత్సవం..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని తాజ్ పూర్ లో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామ ఆంజనేయ స్వామి దేవాలయం ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ముత్యాల పందిరిలో, మామిడి తోరణాలు, పూల మాలల అలంకరణలతో ఎంతో సుందరంగా ముస్తాబు చేసి,భువి నుండి దివికి దిగివచ్చారా అన్న విధముగా,పురోహితుల వేద మంత్రాలతో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం గ్రామ ప్రజలందరి సమక్షంలో అంగరంగ వైభవంగా, ఎంతో కన్నుల పండుగగా జరిగింది.
ఈ సందర్బంగా గ్రామ ప్రజలు శ్రీ సీతా రాముల దివ్య ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తదుపరి గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, పాలకవర్గం ఏర్పాటు చేసిన ‘అన్న ప్రసాద వితరణ’కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, ఉప సర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు, పల్లెపాటి క్రిష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజు, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు,షేక్ అహ్మద్, మాజీ సర్పంచ్ లు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామంలో ని అన్ని యూత్ ల యువకులు, మహిళ లు, గ్రామ ప్రజలు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.



